సిద్దాపూర్ డంపు యార్డ్ పై ఎస్టీ కమిషన్ నోటీసులు..!

రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం సిద్దాపూర్ గ్రామంలో ఎకో టౌన్ పేరిట డంపు యార్డు ఏర్పాటు వివాదాస్పదమైంది. ప్రభుత్వం 80 ఎకరాల్లో డంపు యార్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో సిద్దాపూర్, పరిసర గ్రామస్తులు గత కొద్ది నెలలుగా ఆందోళన చేస్తున్నారు. ఈ డంపు యార్డ్ వల్ల పరిసర తాండాలకు నష్టం జరుగుతుందని గిరిజన నేత రాంబల్, నాయక్ జాతీయ ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్టీ కమిషన్ జిల్లా కలెక్టర్కు, కాలుష్య నివారణ మండలికి నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వం డంపు యార్డును తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు.



