← Back to news

సిద్దాపూర్ డంపు యార్డ్ పై ఎస్టీ కమిషన్ నోటీసులు..!

By Adithya· 2d ago
సిద్దాపూర్ డంపు యార్డ్ పై ఎస్టీ కమిషన్ నోటీసులు..!

రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం సిద్దాపూర్ గ్రామంలో ఎకో టౌన్ పేరిట డంపు యార్డు ఏర్పాటు వివాదాస్పదమైంది. ప్రభుత్వం 80 ఎకరాల్లో డంపు యార్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో సిద్దాపూర్, పరిసర గ్రామస్తులు గత కొద్ది నెలలుగా ఆందోళన చేస్తున్నారు. ఈ డంపు యార్డ్ వల్ల పరిసర తాండాలకు నష్టం జరుగుతుందని గిరిజన నేత రాంబల్, నాయక్ జాతీయ ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్టీ కమిషన్ జిల్లా కలెక్టర్‌కు, కాలుష్య నివారణ మండలికి నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వం డంపు యార్డును తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· just now

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.