గద్వాలకు రైల్వే అభివృద్ధికి కీలక అడుగు

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ను కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పరిశీలించారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా స్టేషన్ను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. బీరెల్లి రోడ్డు మార్గంలో రూ.66 కోట్లతో మరో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించనున్నట్లు వెల్లడించారు. స్టేషన్లో మూడు ఎస్కలేటర్లు, మూడు లిఫ్టులు, ప్లాట్ఫారాల ఆధునికీకరణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. 2027 ఏప్రిల్ నాటికి పనులు పూర్తి చేస్తామని కిషన్రెడ్డి స్పష్టం చేశారు




