← Back to news

గద్వాలకు రైల్వే అభివృద్ధికి కీలక అడుగు

By ARJUN· 4d ago
గద్వాలకు రైల్వే అభివృద్ధికి కీలక అడుగు

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్‌ను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పరిశీలించారు. అమృత్‌ భారత్‌ పథకంలో భాగంగా స్టేషన్‌ను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. బీరెల్లి రోడ్డు మార్గంలో రూ.66 కోట్లతో మరో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించనున్నట్లు వెల్లడించారు. స్టేషన్‌లో మూడు ఎస్కలేటర్లు, మూడు లిఫ్టులు, ప్లాట్‌ఫారాల ఆధునికీకరణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. 2027 ఏప్రిల్‌ నాటికి పనులు పూర్తి చేస్తామని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు

గద్వాలకు రైల్వే అభివృద్ధికి కీలక అడుగు

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 2m ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.