← Back to news

ఆసుపత్రి పనుల్లో స్పీడు పెంచండి : మంత్రి పొన్నం

By శ్రీనివాస్ చిట్టంపెల్లి· 24 Aug 2026· హుస్నాబాద్
ఆసుపత్రి పనుల్లో స్పీడు పెంచండి : మంత్రి పొన్నం

TG : హుస్నాబాద్ పట్టణంలో నిర్మిస్తున్న 250 పడకల ప్రభుత్వ ఆసుపత్రి పనులను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. పనులు ఎంతవరకు వచ్చాయో అధికారులను అడిగి తెలుసుకున్న ఆయన, నిర్మాణం వేగంగా, నాణ్యతగా జరగాలని ఆదేశించారు. అనుకున్న సమయానికే పనులన్నీ పూర్తి చేసి ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు. ఈ భవనం పూర్తయితే నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయన్నారు. పనుల్లో ఎలాంటి ఆలస్యం జరగకుండా అధికారులు చూసుకోవాలని స్పష్టం చేశారు.

More in Local