రేవంత్రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: కొండా సురేఖ!

తనను కేబినెట్ నుంచి తీసేయాలని CM రేవంత్రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్ను బ్లాక్మెయిల్ చేశారని మంత్రి కొండా సురేఖ ప్రెస్మీట్లో సంచలన ఆరోపణలు చేశారు. ఎలాంటి ఎక్స్ప్లనేషన్ తీసుకోకుండానే తనను బర్తరఫ్ చేయడానికి గవర్నర్కు లెటర్ పంపారని మండిపడ్డారు. కాంగ్రెస్ హైకమాండ్కు తనను తొలగించే థాట్ లేదని, CM రేవంత్రెడ్డి, ఆయన బ్రదర్స్ కక్షగట్టి ఈ కుట్ర చేశారని అన్నారు. తనతో పాటు మాజీ ఓఎస్డీ సుమంత్పై కూడా కావాలనే నిందలు వేశారని సురేఖ కామెంట్స్ చేశారు.



