సొరంగంలో కార్మికులు ఇంకా బతికే అవకాశం ఉంది: నేపాల్ అధికారి

నేపాల్లో ఇటీవల వచ్చిన భారీ వరదల కారణంగా రసువాగఢి జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగంలో చిక్కుకున్న 46 మంది కార్మికులు ఇంకా బతికుండే అవకాశం ఉందని నేపాల్ విద్యుత్ ప్రాధికార సంస్థ అధికారి అమ్షు కిరణ్ షాహి అభిప్రాయపడ్డారు. సొరంగంలో గదిని పోలిన నిర్మాణంలో ఆహారం, నీరు నిల్వ ఉండటం వల్ల వారి బతికే అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. నేపాల్తోపాటు భారత్, చైనా, కొరియా, ఆస్ట్రేలియా నిపుణుల సహకారంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.



