ఇండియా మేల్కొంది- GenZ

దేశంలో నీట్, నెట్ వంటి పోటీ పరీక్షల పేపర్ లీకేజీలపై విద్యార్థుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఢిల్లీ నుంచి హైదరాబాద్, చెన్నై, కలకత్తా, జైపూర్, బెంగళూరు వరకు దాదాపు 30కి పైగా ప్రముఖ నగరాల్లో యువత భారీ ఎత్తున రోడ్లపైకి వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు. ‘ఇండియా మేల్కొంది’ అంటూ పేపర్ లీక్ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని స్టూడెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా సాగుతున్న ఈ ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తున్నాయి.







