← Back to news

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

By Bhasker Mamilla· 22 Aug 2026
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

TG: ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలపై బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పోతుగంటి భరత్ ప్రసాద్ ఆరా తీశారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఆయన వైద్య విద్యార్థులు, వైద్యులు, రోగులతో మాట్లాడారు. విద్యార్థుల శిక్షణ, విధుల నిర్వహణపై వివరాలు తెలుసుకున్న అనంతరం చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి వారికి అందుతున్న వైద్యం, ఎదురవుతున్న సమస్యలపై ఆరా తీశారు. అనంతరం వైద్యులతో సమావేశమై ప్రతి రోగికి మెరుగైన వైద్యం, అవసరమైన శ్రద్ధ అందించాలని సూచించారు.

More in Local