CM రేవంత్ రెడ్డికి EC నోటీసులివ్వాలి: BJP

ఓటరు జాబితాలో పేరు లేకుంటే సంక్షేమ పథకాలు అందవని CM రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై BJP తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలతో ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించింది. BJP ఎన్నికల వ్యవహారాల కమిటీ చైర్మన్ మర్రి శశిధర్రెడ్డికి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి పి. సుదర్శన్రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు CMకి నోటీసులు జారీ చేయాలని, కేంద్ర ఎన్నికల సంఘం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.



