OSD సుమంత్ కేసులో పోలీసుల స్పీడ్.. మరో ముగ్గురు అరెస్ట్!

TG: కొండా సురేఖ మాజీ OSD సుమంత్కు సంబంధించిన కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లోని మార్టూరులో ముగ్గురిని ఖైరతాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరుణ్ కుమార్, మత్యాల మహేందర్ రెడ్డి, కార్తీక్ను అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. ఈ అరెస్టులతో ఈ కేసులో నిందితుల సంఖ్య నాలుగుకు చేరింది. ప్రధాన నిందితుడు సుమంత్తో పాటు మరో ఇద్దరు Abscondingలో ఉన్నట్లు తెలుస్తోంది. వారి కోసం పోలీస్ స్పెషల్ టీమ్స్ వెతుకుతున్నాయి.



