← Back to news

తెలంగాణ ఉద్యమకారుల కమిటీపై కల్వకుంట్ల కవిత విమర్శలు

By Balakrishna· 21 Jul 2026

TG : కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం కోసం కమిటీని ఆలస్యంగా ఏర్పాటు చేయడంపై కల్వకుంట్ల కవిత మాట్లాడారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 30 నెలల తర్వాత కమిటీని తీసుకురావడం విచారకరమని అన్నారు. ఉద్యమకారులు రోడ్లపైకి వచ్చి భిక్షాటనలు, ఆందోళనలు చేసిన తర్వాతే ప్రభుత్వం స్పందించిందని విమర్శించారు. ‘కేకే కమిటీ’ అంటేనే కాలయాపన చేసే కమిటీ అనే అభిప్రాయం ప్రజల్లో ఉందని, ఆ భావన తప్పని ప్రభుత్వం తన చర్యల ద్వారా నిరూపించుకోవాలని సవాల్ చేశారు.

More in Politics