ముంజంపల్లి–శాలపల్లి రోడ్డుపై నరకయాతన
TG: 10 ఏళ్లుగా రహదారి పరిస్థితి మారలేదు.. గుంతలమయమైన ముంజంపల్లి–శాలపల్లి రోడ్డుపై ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. జగిత్యాల జిల్లా ఉమ్మడి వెల్గటూర్ మండలం ముంజంపల్లి నుంచి శాలపల్లి వరకు ఉన్న రహదారి అధ్వానంగా మారింది. సాలేపల్లి, చెగ్యాం, తాళ్లకొత్తపేట, సానబండ గ్రామాల ప్రజలు, విద్యార్థులు, రైతులు నిత్యం ఇదే మార్గంలో రాకపోకలు సాగిస్తున్నారు. రహదారిపై ఏర్పడిన గుంతలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు పదేళ్లుగా రహదారి దుస్థితి ఇలాగే ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



