ఇక ప్రతి 45రోజులకు తప్పనిసరి సమావేశం

TG: ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయం మరింత బలోపేతం చేసేందుకు AICC కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ ప్రతి 45రోజులకు ఒకసారి తప్పనిసరిగా సమావేశం కావాలని ఆదేశించింది. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, మంత్రుల పనితీరును సమీక్షించి లోపాలు ఉంటే వెంటనే సరిదిద్దాలని సూచించింది. ఢిల్లీలో జరిగిన సమావేశంలో CM రేవంత్ రెడ్డి, డిప్యూటీ CM భట్టి విక్రమార్క, PCC అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.



