← Back to news

తమిళనాడుకు తరలిస్తున్న గంజాయి పట్టివేత

By CHANDU SPEED NEWS· 26 Aug 2026· Srikakulam
తమిళనాడుకు తరలిస్తున్న గంజాయి పట్టివేత

AP: ఒడిశాలోని పర్లాకిమిడి నుంచి తమిళనాడుకు అక్రమంగా తరలిస్తున్న 32.590 కిలోల గంజాయిని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ టౌన్ పోలీసులు పట్టుకున్నారు. నలుగురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి 16 ప్యాకెట్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ టి. భవాని తెలిపారు. మొత్తం నలుగురు నిందితుల్లో ఒకరిని CICL (Child in Conflict with the Law) గా గుర్తించారు. రూ.80 వేలకు గంజాయిని కొనుగోలు చేసి బస్సులో కాశీబుగ్గకు చేరుకున్నారు. అనంతరం పలాస రైల్వేస్టేషన్ వైపు వెళ్తుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

More in Local