← Back to news

ఇక ప్రతి ఫిర్యాదుకూ పరిష్కారం: పొంగులేటి

By DK· 21 Aug 2026· హైదరాబాద్
ఇక ప్రతి ఫిర్యాదుకూ పరిష్కారం: పొంగులేటి

TG: రాష్ట్రంలోని 22ఏ నిషేధిత భూముల సమస్యలపై ప్రజల నుంచి కాల్ సెంటర్‌కు వస్తున్న ప్రతి ఫిర్యాదును పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో పలు జిల్లాల్లో 22ఏ భూముల పరిస్థితి, పెండింగ్ దరఖాస్తులపై సమీక్షించారు. ఇప్పటివరకు కాల్ సెంటర్‌కు సుమారు 400 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. ప్రతి ఫిర్యాదును సంబంధిత అధికారులకు వెంటనే పంపించి, సమస్య పరిష్కారమయ్యే వరకు పర్యవేక్షించాలని మంత్రి సూచించారు.

More in TG