← Back to news

మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీపై కేసు

By Vishi· 20 Aug 2026
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీపై కేసు

TG: దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌పై మేడిపల్లి పోలీసులు హత్యాయత్నం కేసు రిజిస్టర్ చేశారు. రాడ్లతో దాడి చేసినట్టు గొంగడి హరికృష్ణ ఇచ్చిన ఫిర్యాదుతో అతనితోపాటు మరో ఐదుగురిపై 109 సెక్షన్ నమోదు చేశారు. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసులు జూబ్లీహిల్ప్ స్టేషన్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు. అధికారులపై ఒత్తిడి, కాలుష్య పరిశ్రమల నిర్ణయాల్లో జోక్యం వఆరోపణలు రావడంతో గతేడాది అతణ్ని ప్రభుత్వం ఉద్యోగం నుంచి తొలగించింది.

More in TG