మాచారెడ్డి పీఏసీఎస్ చైర్మన్గా నౌసిలాల్ నాయక్

TG: కామారెడ్డి జిల్లా మాచారెడ్డి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) నూతన చైర్మన్గా నౌసిలాల్ నాయక్ నియమితులయ్యారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి పీఏసీఎస్ చైర్మన్ బాధ్యతలు అప్పగించినందుకు షబ్బీర్ అలీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సహకార సంఘం అభివృద్ధికి, రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేస్తానని నౌసిలాల్ నాయక్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయనను నాయకులు అభినందించారు.


