జావా సముద్రంలో ఘోర ప్రమాదం..130 మంది గల్లంతు

ఇండోనేషియాలోని జావా సముద్రంలో 243 మందితో వెళ్తున్న ‘విర్గో ట్రాన్స్పోర్ట్ 8’ నౌక బోల్తా పడింది. సురబయా నుంచి బంజర్మసిన్కు వెళ్తుండగా భారీ కెరటాలు, తీవ్ర వాతావరణం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 108 మందిని రక్షించగా ఆరు మృతదేహాలు లభించాయి. మరో 129 మంది కోసం 600 మందికి పైగా సిబ్బంది, 17 నౌకలు, 5 హెలికాప్టర్లతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.



