← Back to news

దాచేపల్లిలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమం

By siva· 2d ago
దాచేపల్లిలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమం

AP: పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లి వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు, కార్యకర్తలు నివాళులర్పించారు. రాష్ట్ర ప్రజలకు వైఎస్ రాజశేఖరరెడ్డి అందించిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. పేదలు, రైతులు, సామాన్య ప్రజల కోసం ఆయన చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను నాయకులు గుర్తుచేశారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· just now

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.