దాచేపల్లిలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమం

AP: పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లి వైఎస్సార్సీపీ కార్యాలయంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు, కార్యకర్తలు నివాళులర్పించారు. రాష్ట్ర ప్రజలకు వైఎస్ రాజశేఖరరెడ్డి అందించిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. పేదలు, రైతులు, సామాన్య ప్రజల కోసం ఆయన చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను నాయకులు గుర్తుచేశారు.



