← Back to news

స్మార్ట్ కార్డ్ పంపిణీ.. ఎమ్మెల్యే హామీ!

By Srinivas· 4d ago
స్మార్ట్ కార్డ్ పంపిణీ.. ఎమ్మెల్యే హామీ!

నాగర్ కర్నూల్ లింగాల మండలంలో సోమవారం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. అచ్చంపేట MLA డా. చిక్కుడు వంశీకృష్ణ ఈ వేడుకలో పాల్గొన్నారు. "నేను MLAగా మాత్రమే కాదు, మీ ఇంటి బిడ్డగా మీకు అందుబాటులో ఉంటా" అని ప్రజలకు హామీనిచ్చారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ పూజారి ఈశ్వరమ్మ బుడ్డయ్య, నాగేశ్వరరావు, MRO వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే స్మార్ట్ కార్డుల్లో ఉన్న సాంకేతిక సమస్యల వల్ల చాలామంది రేషన్ సరుకులు అందుకోలేకపోతున్నారు. ఈ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 2m ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.