స్మార్ట్ కార్డ్ పంపిణీ.. ఎమ్మెల్యే హామీ!

నాగర్ కర్నూల్ లింగాల మండలంలో సోమవారం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. అచ్చంపేట MLA డా. చిక్కుడు వంశీకృష్ణ ఈ వేడుకలో పాల్గొన్నారు. "నేను MLAగా మాత్రమే కాదు, మీ ఇంటి బిడ్డగా మీకు అందుబాటులో ఉంటా" అని ప్రజలకు హామీనిచ్చారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ పూజారి ఈశ్వరమ్మ బుడ్డయ్య, నాగేశ్వరరావు, MRO వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే స్మార్ట్ కార్డుల్లో ఉన్న సాంకేతిక సమస్యల వల్ల చాలామంది రేషన్ సరుకులు అందుకోలేకపోతున్నారు. ఈ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.



