గురజాలలో జనసేన భారీ ర్యాలీ
AP: పల్నాడు జిల్లా గురజాలలో జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను జనసేన శ్రేణులు ఘనంగా నిర్వహించారు. దాచేపల్లి జనసేన పార్టీ కార్యాలయం నుంచి నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీగా బయలుదేరి గురజాలకు చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎల్ఈడీ స్క్రీన్పై పవన్ కళ్యాణ్కు సంబంధించిన వీడియోలు, ఆయన కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు.



