తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం
తమిళనాడు తంజావూరు నేషనల్ హైవేపై గవర్నమెంట్ బస్సు బోల్తా పడిన యాక్సిడెంట్లో 15 మందికి గాయాలయ్యాయి. నాగపట్నం వేలంకన్ని నుంచి తిరుచిరాపల్లి వెళ్తుండగా అమ్మపేటై రోడ్డు దగ్గర ఈ ప్రమాదం జరిగింది. స్పాట్కి వచ్చిన పోలీసులు గాయపడిన వారిని వెంటనే దగ్గర్లోని హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. ఈ రోడ్డు యాక్సిడెంట్పై కేసు నమోదు చేసి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.


