చెరువు పైన పందిరి.. రోల్ మోడల్గా నిలిచిన రైతు!
ఒడిశాలోని సుందర్గఢ్కు చెందిన ఒక రైతు వినూత్నంగా ఆలోచించి అందరికీ రోల్ మోడల్గా నిలిచారు. తనకున్న చెరువు పైన ఒక పందిరి సెటప్ చేసి సొరకాయలతో పాటు ఇతర తీగజాతి కూరగాయలను పండిస్తున్నారు. అదే సమయంలో కింద ఉన్న చెరువు నీటిలో చేపల పెంపకం కూడా చేస్తున్నారు. ఇలా ఒకే ప్లేస్లో అటు భూమిని, ఇటు నీటిని వేస్ట్ చేయకుండా వాడుకుంటూ డబుల్ ఇన్కమ్ సంపాదిస్తున్నారు. ఈ వినూత్నమైన అగ్రికల్చర్ ఐడియా ఇప్పుడు చాలా మందికి ఇన్స్పిరేషన్గా నిలుస్తోంది.

