కన్నతల్లినే కడతేర్చిన కొడుకు.. వనపర్తిలో దారుణం

TG: నవమాసాలు మోసి కనిపెంచిన కన్నతల్లినే కొడుకు దారుణంగా హతమార్చిన ఘటన వనపర్తిలో కలకలం రేపింది. గాంధీనగర్ కాలనీలో 60 ఏళ్ల రజియా బేగంను బలమైన ఆయుధంతో తలపై మోది హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యకు కుటుంబ కలహాలు కారణమా? లేక మరేదైనా ఇతర కారణం ఉందా? అనే కోణంలో విచారణ చేస్తున్నారు. తల్లిపై కన్నకొడుకు ఇంతటి కర్కశత్వానికి పాల్పడటంపై స్థానికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.



