← Back to news

ఒంగోలులో TDP vs జనసేన!

By sahani· 10 Aug 2026· AP

AP: ఒంగోలులో TDP, జనసేన నాయకుల మధ్య పొలిటికల్ హీట్ పెరిగింది. TDP MLA దామచర్ల జనార్దన్‌రావుకు మాజీ మంత్రి, జనసేన లీడర్ బాలినేని శ్రీనివాస్ రెడ్డి గట్టి వార్నింగ్ ఇచ్చారు. "ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు" అని తేల్చి చెప్పారు. "TDPకి కేవలం ఓట్లు వేయడానికే మా జనసేన కార్యకర్తలు పనికొస్తారా?" అని ప్రశ్నించిన ఆయన, వారి కోసం దేనికైనా సిద్ధమని మాట్లాడారు. పొత్తులో ఉన్నా అన్యాయం జరుగుతోందని, జనసేన కార్యకర్తలకు తాను ఎల్లవేళలా సపోర్ట్‌గా ఉంటానని జనసేన లీడర్ బాలినేని ప్రకటించారు.

More in Politics