ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై కేఏ పాల్ రియాక్షన్!
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ K.A పాల్ దేశ యువతకు అభినందనలు తెలిపారు. యువత అంతా ఒక్కటైతే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించారని ప్రశంసించారు. విద్యాశాఖ మంత్రి రాజీనామాను ఆమోదించి, విద్యార్థుల డిమాండ్లను విన్నందుకు ప్రధాని మోదీ, అమిత్ షాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, మంచి భవిష్యత్తు కోసం వేచి చూడాలని పిలుపునిచ్చారు.



