గురుకులాల్లో ఖాళీ సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్

TG: గురుకులాల్లో మిగిలిన ఖాళీ సీట్లను భర్తీ చేసేందుకు కామారెడ్డి జిల్లాలో స్పాట్ అడ్మిషన్లకు అధికారులు సిద్ధమయ్యారు. జిల్లాలోని 11 గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు, ఇంటర్ మొదటి సంవత్సరం MPC, BiPC కోర్సుల్లో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయనున్నట్లు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. ఈనెల 25న ఉదయం 9గంటలకు స్పాట్ అడ్మిషన్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. బాలురకు భిక్కనూరులోని గురుకుల కళాశాలలో, బాలికలకు తాడ్వాయిలోని గురుకుల కళాశాలలో కౌన్సెలింగ్ జరుగుతుందని తెలిపారు.



