పబ్లిసిటీ కాదు విద్యాభివృద్ధి ముఖ్యం🏫

మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలో స్కూల్ లో పబ్లిసిటీ కోసం చూపుతున్న శ్రద్ధ స్కూళ్ల డెవలప్మెంట్పై ఎందుకు పెట్టడం లేదని మూడుచింతలపల్లి ప్రజలు ప్రజాప్రతినిధులను ప్రశ్నిస్తున్నారు. మండలంలో ఒక్క ప్రీ-ప్రైమరీ లేదా తెలంగాణ పబ్లిక్ స్కూల్ (TPS) కూడా తీసుకోరాలేకపోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పబ్లిసిటీ పక్కనబెట్టి స్కూల్స్ డెవలప్మెంట్, మౌలిక వసతులపై ఫోకస్ పెట్టాలని, రాజకీయం చేయకుండా అందరూ కలిసి స్టూడెంట్స్ భవిష్యత్తు కోసం పనిచేయాలని కోరుతున్నారు.


