డిగ్రీ గెస్ట్ లెక్చరర్ల కొత్త కమిటీ

తెలంగాణ రాష్ట్ర క్వాలిఫైడ్ డిగ్రీ గెస్ట్ లెక్చరర్ల నూతన రాష్ట్ర కమిటీ ఎన్నికైంది. అధ్యక్షుడిగా డాక్టర్ శ్రీశైలం, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ గడ్డం ఆదాం, కోశాధికారిగా డాక్టర్ కరుణాకర్, ఈసీ మెంబర్గా డాక్టర్ సాయిలు ఎన్నికయ్యారు. గెస్ట్ లెక్చరర్లకు మినిమమ్ బేసిక్ పే (కనీస మూల వేతనం) సాధించడమే తమ కమిటీ ముఖ్య లక్ష్యమని కొత్త ప్రెసిడెంట్ శ్రీశైలం తెలిపారు.




