మెయిన్ స్ట్రీమ్ మీడియా సైలెన్స్పై సోనాక్షి సిన్హా ఫైర్!
స్టూడెంట్స్పై లాఠీచార్జ్ జరుగుతున్నా మెయిన్స్ట్రీమ్ మీడియా కవర్ చేయడం లేదని నటి సోనాక్షి సిన్హా మండిపడ్డారు. ఇది రాజకీయ ప్రచారమో, పార్టీల మధ్య గొడవ కాదని.. సరైన విద్యా వ్యవస్థ కోసం పోరాడుతున్న విద్యార్థుల భవిష్యత్తు సమస్య అని స్పష్టం చేశారు. ప్రొటెస్ట్ ప్రదేశాలకు వెళ్లలేకపోయినా, సోషల్ మీడియా ద్వారా వాయిస్ వినిపించకపోవడం పిరికితనమే అవుతుందని కామెంట్ చేశారు. ఇది సమాజంలో మార్పు తెచ్చే ఒక రివాల్యూషన్ అని, ‘మేల్కొనకపోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది’ అని హెచ్చరించారు.



