పోటాపోటీగా నినాదాలు.. నర్సంపేటలో ఉద్రిక్తత

TG: వరంగల్ జిల్లా నర్సంపేటలో కాంగ్రెస్, BJP శ్రేణులు చేసిన నిరసనలు ఉద్రిక్తతకు దారితీసింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై పోలీసులు చేసిన దాడిని ఖండిస్తూ, రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు కాకతీయ తోరణం వద్ద ధర్నా నిర్వహించారు. దీంతో అక్కడికి చేరుకున్న BJP నాయకులు ప్రతినిరసన చేపట్టడంతో ఇరువర్గాల నాయకులు పోటాపోటీగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ వాగ్వాదం తోపులాటకు దారితీసింది. పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.



