జీతాల్లేక 9 నెలలు..సెక్యూరిటీ గార్డుల ఆవేదన

AP: విజయవాడలోని అంబేద్కర్ సామాజిక శిల్ప ప్రాంగణంలో విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డులకు 9 నెలలుగా జీతాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గుత్తేదారు జీతాల చెల్లింపును అడిగిన ప్రతిసారీ వాయిదా వేస్తున్నారని ఆరోపించారు. ఒక ఉద్యోగికి 13 నెలలుగా జీతం రాలేదని తెలిపారు. కుటుంబ పోషణ భారంగా మారడంతో అప్పులు చేయాల్సి వస్తోందన్నారు. జీతాలు అందక ముగ్గురు ఉద్యోగాలు మానేశారని చెప్పారు. అధికారులు తక్షణమే స్పందించి పెండింగ్ జీతాలు చెల్లించాలని కోరారు.



