సెప్టెంబర్ 1న జగిత్యాల జిల్లాకు ఎస్సీ, ఎస్టీ కమిషన్

రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో పాటు ఐదుగురు సభ్యులు సెప్టెంబర్ 1న జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. చైర్మన్తో పాటు సభ్యులు కుస్రం నీలాదేవి, రాంబాబు నాయక్, కొంకటి లక్ష్మీనారాయణ, జిల్లా శంకర్, రేణికుంట్ల ప్రవీణ్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయానికి చేరుకోనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.



