← Back to news

దేవదాయ భూముల రక్షణకు హెచ్చరిక బోర్డు

By epuri rajaratnam· 4d ago
దేవదాయ భూముల రక్షణకు హెచ్చరిక బోర్డు

తాడేపల్లి మండలం గుండిమెడ గ్రామ పరిధిలోని దేవదాయ ధర్మాదాయశాఖకు చెందిన రూ.30 కోట్ల విలువైన భూముల పరిరక్షణకు అధికారులు చర్యలు చేపట్టారు. ఎండోమెంట్స్‌ ట్రిబ్యునల్‌లో కేసు తీర్పు పెండింగ్‌లో ఉండగానే కొందరు భూములను విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించారు. ఆర్‌.ఎస్‌. నంబర్లు 260/1, 260/2 లోని భూముల్లో ఎలాంటి క్రయవిక్రయాలు చేయకూడదని హెచ్చరిస్తూ అధికారులు బోర్డు ఏర్పాటు చేశారు. ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 2m ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.