← Back to news

సీఎం రేవంత్ రెడ్డికి రాఖీలు కట్టిన మంత్రులు

By Raju· 28 Aug 2026

రక్షాబంధన్ సందర్భంగా మంత్రులు కొండా సురేఖ, సీతక్క సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి రాఖీ కట్టారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత కొండా సురేఖ మాట్లాడుతూ “నేను అందరికీ సోదరినే. పండుగ వాతావరణంలో ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయను. ముఖ్యమంత్రికి మహిళల అండ ఎప్పుడూ ఉంటుంది. మా ఆడపడుచులందరిపైనా ఆయన ఆశీర్వాదం ఉండాలి” అని అన్నారు.

More in TG