బిల్లులు ఇవ్వకపోతే స్కూళ్లకు తాళాలు

TG : తెలంగాణలో ‘మన ఊరు - మన బడి’ పనులు చేసిన కాంట్రాక్టర్లు ప్రభుత్వం పై మండిపడుతున్నారు. పనులు పూర్తి చేసి మూడేళ్లవుతున్నా పెండింగ్ బిల్లులు ఇవ్వకపోవడంతో అప్పుల పాలయ్యామని అంటున్నారు. ఈ విషయమై ఖమ్మం కలెక్టర్ను కలసి వినతిపత్రం ఇచ్చారు. సెప్టెంబర్ 17 లోగా పైసలు రిలీజ్ చేయకపోతే, తాము పనులు చేసిన ప్రభుత్వ స్కూళ్లకు తాళాలు వేస్తామని తెలిపారు.



