రిలే నిరాహార దీక్షలను జయప్రదం చేయండి

TG: గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 24 నుంచి 26 వరకు జిల్లా కలెక్టరేట్ల ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు సీఐటీయూ వనపర్తి జిల్లా నాయకత్వం ప్రకటించింది. మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేసి, కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని, అధికారుల, రాజకీయ నాయకుల వేధింపులు ఆపాలని కోరారు. ఈఎస్, పీఎఫ్ సౌకర్యాలు కల్పించడంతో పాటు పీఆర్సీ పరిధిలోకి తీసుకురావాలని అన్నారు.



