తిరుమలలో సీఎం చంద్రబాబు రెండో రోజు

AP: తిరుమలలో CM చంద్రబాబు నాయుడు 2వ రోజు పర్యటించారు. నారాయణగిరి ఉద్యానవనాల వద్ద టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడుతో కలిసి రిలయన్స్, భారత్ బయోటెక్ సంస్థలు విరాళంగా ఇచ్చిన EV బస్సులను ప్రారంభించారు. అనంతరం నారాయణగిరి నుంచి ఎస్వీ మ్యూజియం వరకు ఈవీ బస్సులో సీఎం స్వయంగా ప్రయాణించారు. ఈ కార్యక్రమం ద్వారా తిరుమలలో పర్యావరణ హిత రవాణా వ్యవస్థను ప్రోత్సహించే దిశగా అడుగులు పడ్డాయి.

