మరిపెడ వద్ద రోడ్డు యాక్సిడెంట్

మరిపెడ మండలం బురహన్ పురం వద్ద ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..బురహన్ పురంకు చెందిన షేక్ రంజాన్ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా లారీ ఢీకొని తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


