దభోల్కర్ వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం

TG: మూఢనమ్మకాలను ప్రశ్నిస్తూ వైజ్ఞానిక దృక్పథం కోసం జీవితాంతం పోరాడిన డా. నరేంద్ర దభోల్కర్ను స్మరించుకుంటూ ఇవాళ (ఆగస్టు 20న) హైదరాబాద్లో నేషనల్ సైంటిఫిక్ టెంపర్ డేను నిర్వహించనున్నారు. దభోల్కర్ వర్ధంతి సందర్భంగా మూఢనమ్మకాలను తిరస్కరించి, విజ్ఞానాన్ని స్వీకరించాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ప్రశ్నించడం, హేతుబద్ధంగా ఆలోచించడం, ఆధారాలను పరిశీలించడం వంటి శాస్త్రీయ విలువలను ప్రజల్లో పెంపొందించాల్సిన అవసరాన్ని వివరించనున్నారు. బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కార్యక్రమం జరగనుంది.



