పద్మశాలి సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం
TG: వరంగల్ జిల్లా నర్సంపేటలో పట్టణ పద్మశాలి సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ పెండి శ్రీలక్ష్మి రామానంద్ హాజరై నూతన కార్యవర్గ సభ్యులను అభినందించారు. సంఘం అభివృద్ధి, సభ్యుల సంక్షేమం కోసం నూతన కార్యవర్గం సమష్టిగా కృషి చేయాలని ఆమె సూచించారు. పద్మశాలి సంఘ సభ్యుల మధ్య ఐక్యతను బలోపేతం చేస్తూ, వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు సంఘం అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.



