వార్ సైరన్.. ఉక్రెయిన్లో జగిత్యాల వాసి మృతి!

జగిత్యాల జిల్లా హస్నాబాద్ గ్రామానికి చెందిన వావిలాల సుదర్శన్ (42) ఉక్రెయిన్ యుద్ధంలో మృతి చెందారు. కుటుంబ పోషణ కోసం కంపెనీ వీసాపై 4 నెలల క్రితం ఆయన అక్కడికి వెళ్లి నిర్మాణ రంగంలో పనిచేస్తున్నారు. సోమవారం రాత్రి రష్యా డ్రోన్, క్షిపణి దాడులు చేసింది. వార్ సైరన్ మోగడంతో ఆయన రూమ్ నుంచి బయటకు పరిగెత్తారు. దురదృష్టవశాత్తూ.. ఆయన వెళ్తున్న దిశలోనే క్షిపణి పడిపోయింది! ఆ దాడిలో 12 మంది మృతి చెందారు. ఆ దాడిలో మరో జగిత్యాల వాసి మాత్రం సురక్షితంగా తప్పించుకున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.



