← Back to news

వార్ సైరన్.. ఉక్రెయిన్లో జగిత్యాల వాసి మృతి!

By Srikanth· 2d ago· Jagitial, Jagitial, Jagitial
వార్ సైరన్.. ఉక్రెయిన్లో జగిత్యాల వాసి మృతి!

జగిత్యాల జిల్లా హస్నాబాద్ గ్రామానికి చెందిన వావిలాల సుదర్శన్ (42) ఉక్రెయిన్ యుద్ధంలో మృతి చెందారు. కుటుంబ పోషణ కోసం కంపెనీ వీసాపై 4 నెలల క్రితం ఆయన అక్కడికి వెళ్లి నిర్మాణ రంగంలో పనిచేస్తున్నారు. సోమవారం రాత్రి రష్యా డ్రోన్, క్షిపణి దాడులు చేసింది. వార్ సైరన్ మోగడంతో ఆయన రూమ్ నుంచి బయటకు పరిగెత్తారు. దురదృష్టవశాత్తూ.. ఆయన వెళ్తున్న దిశలోనే క్షిపణి పడిపోయింది! ఆ దాడిలో 12 మంది మృతి చెందారు. ఆ దాడిలో మరో జగిత్యాల వాసి మాత్రం సురక్షితంగా తప్పించుకున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 2m ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.