ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్న అభిజిత్ దీప్కే!

సోనమ్ వాంగ్చుక్ అరెస్ట్కు నిరసనగా 'కాక్రోచ్ జనతా పార్టీ' ఫౌండర్ అభిజిత్ దీప్కే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన జంతర్ మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష స్టార్ట్ చేశారు. సోనమ్ వాంగ్చుక్ ఫోటోను చేతబట్టుకుని ఆయన దీక్షకు కూర్చున్న పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా జులై 20న జరగబోయే 'చలో సంసద్' మార్చ్ ఎలాంటి మార్పులు లేకుండా ప్లాన్ ప్రకారం జరిగి తీరుతుందని స్పష్టం చేశారు. దీంతో ఢిల్లీలో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది.


