నేతన్నలకు ఆర్థిక సాయం..ఎంత?

ఆంధ్రప్రదేశ్ ‘నేతన్న సేవ’ పథకం కింద అర్హులైన ప్రతి నేతన్నకు 25 వేల ఆర్థిక సాయం అందజేస్తోందని AP మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి చెప్పారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలోని క్యాంపు ఆఫీసులో పలుకూరు గ్రామానికి చెందిన చేనేత కార్మికులు మంత్రిని కలిశారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకంపై నేతన్నలు చాలా హ్యాపీగా ఫీలవుతూ, మంత్రి జనార్దన్ రెడ్డికి థాంక్స్ చెప్పారు.


