ఆరోగ్యానికి సామ.. సరైన ధర లేదు!
ఒకప్పుడు ఆదివాసీ ప్రాంతాల్లో విస్తారంగా సాగయ్యే చిట్టిగింజల సామ – ఇప్పుడు అంతరించిపోయే స్థితిలో ఉంది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, మన్యం పార్వతీపురం జిల్లాల్లో పాక్షికంగా మిగిలిన ఈ పంట – ఆగస్టు-సెప్టెంబర్లో చేతికొస్తుంది. ఆరోగ్య ప్రయోజనాలు చెప్పుకుంటే – బీపీ, షుగర్ తగ్గించడంలో సామ బియ్యం సూపర్ అంటారు డాక్టర్లు. అయినా సరైన గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల ఆదివాసీ రైతులు ఈ పంటను వదిలేస్తున్నారు. ప్రభుత్వం MSP ప్రకటించి, ప్రోత్సాహకాలు ఇస్తేనే ఈ సాంప్రదాయ పంటకు లైఫ్. లేకుంటే హిస్టరీ బుక్స్ కే పరిమితం.



