ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాలి

TG: జగిత్యాల జిల్లా బుగ్గారం మండలంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ, ధర్మ సమాజ్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. తెలంగాణలో సుమారు 30 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన దాదాపు రూ.14 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ మేరకు మంగళవారం బుగ్గారం మండలంలో ఎంఆర్ఓ అందుబాటులో లేకపోవడంతో డీటీ రాకేష్కు జేఏసీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.



