పాతపట్నం కోర్టులో విధులు బహిష్కరించిన న్యాయవాదులు

అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పాతపట్నం కోర్టు న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించారు. న్యాయవాదులపై దాడులు, బెదిరింపులు వంటి ఘటనల నుంచి రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని పేర్కొన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు యు.దాలయ్య, కార్యదర్శి ఎం.రమణ ఆధ్వర్యంలో న్యాయవాదులు కోర్టు విధులకు దూరంగా ఉండి నిరసన తెలిపారు.



