← Back to news

పాతపట్నం కోర్టులో విధులు బహిష్కరించిన న్యాయవాదులు

By bhaskararao· 4d ago
పాతపట్నం కోర్టులో విధులు బహిష్కరించిన న్యాయవాదులు

అడ్వకేట్స్‌ ప్రొటెక్షన్‌ యాక్ట్‌ను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ పాతపట్నం కోర్టు న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించారు. న్యాయవాదులపై దాడులు, బెదిరింపులు వంటి ఘటనల నుంచి రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని పేర్కొన్నారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు యు.దాలయ్య, కార్యదర్శి ఎం.రమణ ఆధ్వర్యంలో న్యాయవాదులు కోర్టు విధులకు దూరంగా ఉండి నిరసన తెలిపారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· just now

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.