← Back to news

ఓర్సీల ద్వారా భూములకు పట్టాలు ఇవ్వాలి

By Bhasker Mamilla· 4d ago
ఓర్సీల ద్వారా భూములకు పట్టాలు ఇవ్వాలి

కోడేరు మండలం కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జనుంపల్లి గ్రామంలోని దళిత రైతుల భూ సమస్యను పరిష్కరించాలని కోరుతూ సీపీఐ(ఎం) జనుంపల్లి గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. గ్రామంలోని దళితుల భూములకు సంబంధించి గతంలో ఓఆర్‌సీలు మంజూరైనప్పటికీ, నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటివరకు భూములకు పట్టాలు చేయలేదని సీపీఐ(ఎం) నాయకులు తెలిపారు. పట్టాలు లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రైతు భరోసా పథకాల ప్రయోజనాలు కూడా పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఓర్సీల ద్వారా భూములకు పట్టాలు ఇవ్వాలి

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 2m ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.