ఓర్సీల ద్వారా భూములకు పట్టాలు ఇవ్వాలి

కోడేరు మండలం కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జనుంపల్లి గ్రామంలోని దళిత రైతుల భూ సమస్యను పరిష్కరించాలని కోరుతూ సీపీఐ(ఎం) జనుంపల్లి గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. గ్రామంలోని దళితుల భూములకు సంబంధించి గతంలో ఓఆర్సీలు మంజూరైనప్పటికీ, నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటివరకు భూములకు పట్టాలు చేయలేదని సీపీఐ(ఎం) నాయకులు తెలిపారు. పట్టాలు లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రైతు భరోసా పథకాల ప్రయోజనాలు కూడా పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.




