ధర్మపురి క్యాంప్ ఆఫీస్లో వినాయక చవితి

జగిత్యాల జిల్లా ధర్మపురిలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో వినాయక చవితి వేడుకలు జరిగాయి. అక్కడ ప్రతిష్టించిన గణపతి విగ్రహానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పూజలు చేశారు. ఈ తొమ్మిది రోజులు పండుగను జనాలు సంతోషంగా జరుపుకోవాలని చెప్తూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలకు వినాయక చవితి విషెస్ తెలిపారు. ఈ ఈవెంట్లో మున్సిపల్ చైర్మన్ వేముల నాగలక్ష్మితో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు.




