క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యం: డీసీసీ

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల కాంగ్రెస్ కార్యాలయంలో శనివారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. మండల అధ్యక్షులు కిషన్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు.<br>సంఘటన్ శ్రీజన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మండల కమిటీ ఎన్నికల కోసం నాయకులు, కార్యకర్తల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా సుగుణక్క మాట్లాడుతూ, పార్టీ నిబంధనలకు లోబడి కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని నాయకులను ఆదేశించారు.



