← Back to news

బ్రిటిష్ కాలం నాటి స్టేషన్కు మళ్లీ శ్వాస!

By శ్రీను· 24 Aug 2026

భద్రాద్రి కొత్తగూడెం ఇల్లందులో బ్రిటిష్ కాలం నాటి రైల్వే స్టేషన్ మళ్లీ సజీవమవుతోంది! బొగ్గు రవాణాతో పాటు ప్యాసింజర్ రైళ్లు కూడా నడిచే ఈ స్టేషన్లో గూడ్స్ మాత్రమే మిగిలి, ప్యాసింజర్ సేవలు 20 ఏండ్లుగా నిలిచిపోయాయి. ఇప్పుడు ప్రజల విజ్ఞప్తి మేరకు రైల్వే శాఖ పునరుద్ధరణ పనులు ప్రారంభించింది. తొలి దశలో కారేపల్లి నుంచి ఇల్లందు వరకు రైల్వే మార్గం, స్టేషన్ మౌలిక వసతుల పునరుద్ధరణ పనులు మొదలయ్యాయి. స్వాతంత్ర్యానికి ముందే నిజాం కాలంలో విజయవాడ–డోర్నకల్ మీదుగా ఇక్కడ ప్యాసింజర్ రైళ్లు నడిచిన చరిత్ర ఉంది.

More in Local